దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

author img

By

Published : Oct 2, 2022, 7:59 PM IST

south africa india odi series

India South Africa ODI Series 2022 : దక్షిణాఫ్రికాతో ఆడబోయే వన్డే సిరీస్​కు 15 మందితో జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇరు జట్ల మొదటి మ్యాచ్​ లఖ్​నవూ వేదికగా జరగనుంది.

India South Africa ODI Series 2022 : మెగా టోర్నీకి ముందు దక్షిణాఫ్రికాతో ఆడబోయే వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్​లో మూడు మ్యాచ్​లు ఆడనున్నారు. అయితే ఇందులో టీ20 వరల్డ్​ కప్​నకు ఎంపికైన ప్లేయర్ దీపక్​ చాహర్​, బుమ్రా స్థానంలో టీ20 జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్​ మాత్రమే ఉన్నారు. శిఖర్ ధావన్ సారథ్యంలో అక్టోబర్ 6న లక్నో వేదికగా మొదటి మ్యాచ్​ జరగనుంది

టీమ్​ ఇండియా వన్డే జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్​మన్​ గిల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్​), రజత్ పాటీదార్, రాహుల్ తిపాఠి, ఇషాన్​ కిషన్(వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, షాబాజ్​ అహ్మద్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అవేష్​ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.

ఇదే షెడ్యూల్:

రోజు తేది మ్యాచ్​వేదిక
గురువారంఅక్టోబర్ 6 లఖ్​నవూమొదటి ఓడీఐ
ఆదివారంఅక్టోబర్ 9రాంచీరెండో ఓడీఐ
మంగళవారం అక్టోబర్ 11దిల్లీమూడో ఓడీఐ

ఇవీ చదవండి: 'ఒకే జట్టును పదే పదే ఆడించాలనడం తగదు'.. టీమ్ సెలక్షన్​పై ద్రవిడ్​ స్పందన

ఆసక్తిగా భారత్-పాక్ మ్యాచ్​ ప్రోమో.. మీరు చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.