మరో మూడేళ్ల పాటు కోకాకోలా ప్రచారకర్తగా గంగూలీ

author img

By

Published : Oct 13, 2021, 4:16 PM IST

Coca-Cola India extends partnership with Sourav Ganguly as ambassador for next 3 yrs

ప్రముఖ కూల్​డ్రింక్​ కంపెనీ కోకాకోలాకు మరో మూడేళ్ల పాటు ప్రచారకర్తగా(Coca Cola India Brand Ambassador) వ్యవహరించనున్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ(Ganguly News). త్వరలోనే ఈ కాంట్రాక్ట్​ ముగియనున్న నేపథ్యంలో దాన్ని మరో మూడేళ్లు పొడిగించనున్నట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.

ప్రముఖ కూల్​డ్రింక్​ సంస్థ కోకాకోలాకు బ్రాండ్​ అంబాసిడర్​గా(Coca Cola India Brand Ambassador) టీమ్ఇండియా మాజీ కెప్టెన్​, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ(Ganguly News) వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ కాంట్రాక్ట్​ ముగియనున్న నేపథ్యంలో దాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తున్నట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ విషయాన్ని కోకాకోలా సౌత్​వెస్ట్​ ఆసియా ఉపాధ్యక్షుడు, మార్కెటింగ్​ హెడ్​ అర్నాబ్​ రాయ్​ వెల్లడించారు. 2017లో కోకాకోలాకు బ్రాండ్​ అంబాసిడర్​గా ఎంపికైన దాదా.. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

"ఈ బ్రాండ్​ను మరింత విస్తరించడం సహా దాన్ని ప్రోత్సహించేందుకు నేను ఎదురుచూస్తున్నా. గతంలో కంటే ఈసారి ఎక్కువగా భారత క్రీడల్లో తమదైన ముద్ర ఉండాలనే విధంగా కోకాకోలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. భారత క్రీడలకు ఇదో గొప్ప వార్త".

- సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

అమెరికాకు చెందిన ఈ శీతల పానీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో క్రీడా ఈవెంట్లకు ప్రచారకర్తగా ఉంది. కోకాకోలా, డైట్​ కోక్​,థమ్సప్​, ఫాంటా వంటి కూల్​డ్రింక్స్​ను ఈ సంస్థే తయారు చేస్తుంది. ఇటీవలే జరిగిన టోక్యో ఒలింపిక్​(Tokyo Olympics 2021) గేమ్స్​కు థమ్సప్​ కూల్​డ్రింక్​ ప్రపంచవ్యాప్త భాగస్వామిగా వ్యవహరించింది.

ఇదీ చూడండి.. IPL 2021: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా కోల్​కతా-దిల్లీ ఢీ.. ఇవి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.