CCL 2023: తెలుగు వారియర్స్​కు చెన్నై రైనోస్​ షాక్​.. కానీ సెమీ ఫైనల్స్​లోకి!

author img

By

Published : Mar 12, 2023, 9:40 PM IST

Etv Bharat

2023 సెలబ్రిటీ క్రికెట్ లీగ్​లో తెలుగు వారియర్స్ వరుస దూకుడుకి బ్రేక్​ పడింది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో తమిళ రైనోస్​ విజయం సాధించింది.

2023 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తుది దశకు చేరుకుంటుంది. ఇక తెలుగు వారియర్స్ ఇప్పటివరకు దూకుడుగా ఆడుతూ పాయింట్స్ పట్టికలో డామినేషన్ చూపించింది. అయితే తమిళ హీరోల టీమ్ చెన్నై రైనోస్ నుంచి వారికి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన మ్యాచ్​లో తెలుగు వారియర్స్​ ఓటమి పాలైంది.

10 ఓవర్లతో రెండేసి ఇన్నింగ్స్​లతో టెస్ట్ ఫార్మాట్​లో సీసీఎల్​ మ్యాచులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఇన్నింగ్స్​లో చెన్నై ప్లేయర్స్​ను 84 పరుగులకే కట్టడి చేశారు తెలుగు వారియర్స్​ బౌలర్లు. అసలు మొదట 5 ఓవర్స్​కు తమిళ టీమ్​లో సగం మంది బ్యాటర్లు పెవిలియన్​కు చేరారు. అందులో కలరీ అరిసం 28(18) పరుగులు చేసి ధీటుగా నిలబడి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఇక రఘు 3 వికెట్లు, ప్రిన్స్ రెండు వికెట్లు తీశారు.

ఇక తెలుగు వారియర్స్ మొదటి ఇన్నింగ్స్​ను కూల్​గా స్టార్ట్ చేయాలని అనుకుంది. కానీ మొదటి ఓవర్​లోనే ఊహించని విధంగా అక్కినేని అఖిల్ ఔట్ అయ్యారు. అఖిల్ సింగిల్ డిజిట్ స్కోర్ చేయడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రాషన్ ఒక్కడే 56 రన్స్ చేసి టాప్​ స్కోరర్​గా నిలిచారు. తమిళ టీమ్​ బౌలింగ్ స్ట్రాంగ్​గా ఉన్నప్పటికీ మిగతా వాళ్లు నిలదొక్కుకున్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్​లో పై చేయి సాధించింది తెలుగు హీరోలు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులు సాధించారు.

ఇక రెండవ ఇన్నింగ్స్​లో తమిళ హీరోలు మంచి స్కోర్​ను అందించారు. మొదట విష్ణు విశాల్ 24 పరుగులు చేయగా ఆ తర్వాత పృథ్వీ 12 బంతుల్లో 24 పరుగులు చేసి టాప్ స్కోరర్స్​గా నిలిచారు. ఇక తెలుగు హీరోల్లో తమన్ మూడు వికెట్లు తీయగా.. నందకిషోర్ 2 వికెట్లు అందుకున్నారు. రెండవ ఇన్నింగ్స్​లో చెన్నై రైనోస్ 119 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది.

ఇక రెండో ఇన్నింగ్స్​లో 101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఊహించని విధంగా ఆటను స్టార్ట్ చేశారు. తమన్, అశ్విన్ బాబు ఓపెనర్లుగా దిగారు. అయితే 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తెలుగు వారియర్స్ కష్టాల్లో పడింది. ఇక ఆ తరువాత సచిన్ జోషి కూడా ఎక్కువ సేపు ఉండలేకపోయారు. 5 పరుగులే వెనుదిరిగారు. అనంతరం అఖిల్ అక్కినేని ఆటను కాస్త ట్రాక్​లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అతను 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఒకవిధంగా చెన్నై రైనోస్ బౌలింగ్ స్ట్రాంగ్​గా ఉండడం వల్ల తెలుగు హీరోలు బాల్స్​ను బౌండరీకి తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంతకుముందు సెంచరీ బాదిన అఖిల్ ఈ మ్యాచ్​లో 30 పరుగులు కూడా చేయలేకపోయారు. మొత్తానికి తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 80 పరుగులకే ఆటను ముగించింది. కానీ తెలుగు వారియర్స్​ టీమ్​ సెమీఫైనల్స్​కు చేరినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.