వెబ్​సిరీస్​గా 2007 టీ20 వరల్డ్​కప్.. ఇక క్రికెట్​ ఫ్యాన్స్​కు పండగే!

author img

By

Published : Nov 18, 2022, 3:38 PM IST

2007 worldcup as Documentary webseries

టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియా తొలి విశ్వవిజేత. సీనియర్లు లేని భారత జట్టు మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో ఈ ఘనత సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చారిత్రక విజయం నమోదు చేసి సగటు భారత క్రికెట్‌ అభిమాని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. అయితే ఇంకా ఆ మధుర స్మృతులు క్రికెట్ ప్రేమికుల కళ్లల్లో కదలాడుతునే ఉన్నాయి. ఇప్పుడా స్మృతులనే త్వరలోనే తెరపైకి తీసుకురానున్నారు. ఆ వివరాలు..

మధుర జ్ఞాపకాలు ఎన్నిసార్లు గుర్తుచేసుకున్నా సరే అద్భుతంగానే ఉంటాయి. మనసుకు ఏదో తెలియని హాయినిస్తాయి. వాటిని స్క్రీన్​పై చూసే మరింత ఆనందమేస్తుంది. త్వరలోనే అదే ఆనందాన్ని క్రికెట్ ప్రేమికులు చూడబోతున్నారు. అదేంటని అనుకుంటున్నారా?

టీమ్​ఇండియాకు ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది 2007 టీ20 ప్రపంచకప్. ఎందుకంటే టీ20 క్రికెట్‌లో మన జట్టే తొలి విశ్వవిజేత. ఈ మెగాటోర్నీనే మరోసారి మన ముందుకు రాబోతుంది. సీనియర్లు లేని భారత జట్టు మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో ఈ ఘనత సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చారిత్రక విజయం నమోదు చేసి సగటు భారత క్రికెట్‌ అభిమాని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. ఆ మధుర స్మృతులు ఎప్పుడూ అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉంటాయి. ఇప్పుడా స్మృతులనే త్వరలోనే స్క్రీన్​పైకి మరోసారి తీసుకురానున్నారు.

ఎప్పటికీ మర్చిపోలేం.. ప్రస్తుత క్రికెట్​లో టీ20కు ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. అయితే టీ20ల్లో ఎన్ని లీగ్స్ వచ్చినా, ఎన్ని వరల్డ్ కప్స్ జరిగినా.. 2007 టీ20 ప్రపంచకప్ మాత్రం టీమ్​ఇండియా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే టీ20 ఫార్మాట్​లో ఏ జట్టుకి కూడా అప్పటికి పెద్దగా అనుభవం లేదు. అలానే అప్పటివరకు ఉన్న సీనియర్స్ కాకుండా కుర్రాళ్లతో భారత జట్టు ఈ సిరీస్ లో అడుగుపెట్టింది. ప్రతి మ్యాచ్​లోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తూ, ఫైనల్లో దాయాది పాక్​ని మట్టికరిపించి కప్ ఎగరేసుకుపోయింది. నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లో జోగిందర్‌ శర్మ వేసిన ఆ చివరి ఓవర్‌ అయితే మెమరబుల్​ ఎక్స్​పీరియన్స్​. మిస్బా ఆడిన స్కూప్‌ షాట్‌ను అనూహ్యంగా క్యాచ్‌ అందుకున్న శ్రీశాంత్‌.. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్‌ ధోనీని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ముఖ్యంగా అప్పుడే కెరీర్​ ప్రారంభించిన ధోనీ కూడా తన స్టామినా ఏంటనేది ఒక్క టోర్నీతో నిరూపించుకున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్​లో మహీ పేరు మార్మోగిపోయింది. అదే టోర్నీలో యువరాజ్.. ఇంగ్లాండ్ జట్టుపై ఒకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్సుల్ని ఇప్పటికీ మర్చిపోలేం. మొత్తంగా ఈ మెగా టోర్నీ విజయం సమష్టి కృషికి నిదర్శనం, అసలైన సారథ్యానికి నిలువుటద్దం. ఇప్పుడా మధుర అనుభూతుల్నే డాక్యూమెంటరీ వెబ్​సిరీస్​​ రూపంలో స్క్రీన్ పైకి తీసుకురానున్నారు.

యూకేకు చెందిన వన్ వన్ సిక్స్ నెట్ వర్క్ దీన్ని నిర్మిస్తోంది. ఆనంద్ కుమార్ డైరెక్టర్. ఈ సిరీస్​ను పలు భాషల్లో డాక్యుమెంటరీగా తీస్తున్నారు. అంటే రియల్ ఇన్సిడెంట్స్​నే మళ్లీ మన కళ్ల ముందుకు తీసుకొస్తారు. అప్పటి జట్టులోని 15 మంది ఆటగాళ్లు, తమ అనుభవాల్ని పంచుకుంటారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూరైంది. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ వెబ్ డాక్యు సిరీస్​ను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని మేకర్స్​ ప్రకటించారు.

2007 worldcup as Documentary webseries
వెబ్​సిరీస్​గా 2007 టీ20 వరల్డ్​కప్

ఇదీ చూడండి: కేన్​ మామపై కన్నేసిన ఐపీఎల్​ టీమ్​ ఇదే!.. మరీ అన్ని కోట్లా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.