అండర్-14 డ్రీమ్ ఛేజర్స్ కప్లో ఓ యువ బ్యాటర్ విధ్వంసం సృష్టించాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 30 సిక్సర్లు, 28 ఫోర్లతో అదరగొట్టాడు. అతడే దిల్లీ క్యాపిటల్స్ అకాడమీకి చెందిన 13 ఏళ్ల బాలుడు మోహక్ కుమార్(mohak kumar score).
125 బంతులను ఆడిన మోహక్ 331 పరుగులు చేశాడు. 264కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కేవలం సిక్సర్లతోనే 180 పరుగులు చేసిన అతడు.. ఫోర్లతో 112 పరుగులు సాధించి అరుదైన ఘనతను సాధించాడు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో దిల్లీ క్యాపిటల్స్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
గతంలో..
2016లో మహారాష్ట్ర క్రికెటర్ ప్రణవ్ ధన్వాడే స్కూల్ క్రికెట్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఏకంగా ఒకే మ్యాచ్లో 1009 పరుగులు చేశాడు. ఒకే మ్యాచ్లో 1000కి పైగా పరుగులు చేసిన ఏకైన బ్యాటర్గా నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్కు చెందిన ఈజే కొలిన్స్(628 పరుగులు) ఉన్నాడు. ఇతడు 1899లో ఈ ఘనత సాధించాడు.
ఇదీ చదవండి:
IPL 2022: ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఐపీఎల్-15 అప్పటినుంచే..!