సత్తా చాటిన కృష్ణా నగర్​.. నేషనల్స్​లో మూడు స్వర్ణాలు

author img

By

Published : Dec 27, 2021, 8:11 AM IST

Krishna Nagar

Krishna Nagar: పారా ఒలింపిక్ విజేత కృష్ణా నగర్​ మరో రికార్డు సాధించారు. భువనేశ్వర్​లో జరుగుతున్న జాతీయస్థాయి పారా బ్యాడ్మింటన్​ పోటీల్లో మూడు బంగారు పతాకాలు సాధించారు.

para badminton national gold medalist: పారా ఒలింపిక్​ విజేత కృష్ణా నగర్​ తన అత్యుత్తమ ఫామ్​ను కొనసాగిస్తున్నారు. భువనేశ్వర్​లో జరుగుతున్న జాతీయ నాలుగో పారా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో మూడు బంగారు పతకాలు సాధించారు.

సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఛాంపియన్‌గా నిలిచారు. 2019లో జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలను గెలుచుకుని రికార్డు సాధించిన కృష్ణా నగర్​.. తన రికార్డును తానే పునరావృతం చేశారు.

పురుషుల సింగిల్స్​లో 21-12, 21-12 పాయింట్లతో ప్రత్యర్థి సుదర్శన్​పై నెగ్గి పసిడి పతకాన్ని ఒడిసిపట్టారు కృష్ణ. ఈ మ్యాచ్​ను కేవలం 20 నిమిషాల్లోనే ముగించడం విశేషం.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కృష్ణా నగర్​- నిత్య శ్రీ జోడీ.. దినగరన్‌-లతాతై ఉమ్రేకర్‌పై కేవలం 17 నిమిషాల్లో విజయం సాధించింది. పురుషుల డబుల్స్​లో కృష్ణా​ నగర్​-రాజా మగోత్రా జోడీ 21-15, 21-15తో దినగరన్-శివరాజన్ జోడీని మట్టికరింపించింది.

"నా ఆటతీరు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. వరుసగా నేషనల్స్‌లో మొత్తం 3 స్వర్ణాలు గెలుచుకోవడం గొప్ప అనుభూతి. ప్రస్తుతం నా దృష్టి.. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్‌లపైనే ఉంది. ఈ విజయం తప్పకుండా నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరింత మెరుగ్గా సన్నద్ధం కావడానికి సహాయపడుతుంది," అని కృష్ణా నగర్​ చెప్పారు.

ఇవీ చూడండి:

'కెప్టెన్సీ వ్యవహారం.. వారిద్దరికీ వరంగా మారొచ్చు'

కేఎల్​ రాహుల్​-మయాంక్​ రికార్డు.. 11ఏళ్లలో ఇదే తొలిసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.