ప్రముఖ గాయని కుటుంబం అదృశ్యం.. రైల్వే ట్రాక్​పై తండ్రి మృతదేహం!

author img

By

Published : Nov 25, 2021, 12:14 PM IST

Updated : Nov 25, 2021, 1:54 PM IST

singer harini rao

వారం రోజుల క్రితం ప్రముఖ గాయని హరిణి రావు కుటుంబం అదృశ్యమైంది. రెండు రోజుల క్రితం బెంగళూరులో హరిణి తండ్రి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.

బెంగళూరులో ప్రముఖ సింగర్ హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు. తన తండ్రిది కచ్చితంగా హత్యేనని హరిణి అనుమానం వ్యక్తం చేస్తూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

singer harini rao
గాయని హరిణి

ఈ మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏకే రావు కుటుంబసభ్యుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏకే రావు.. తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. వారం రోజులుగా ఆయన కుటుంబసభ్యులతో సహా అదృశ్యమయ్యారు.

singer harini rao
ఏకే రావు

అప్పటి వరకు అదృశ్యం.. కానీ!

వారంతా ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేకపోవడం సహా హఠాత్తుగా ఏకే రావు మృతదేహం బెంగుళూరులో రైలు పట్టాలపై రెండు రోజుల క్రితం కనిపించింది. ఏకే రావు మృతదేహం రైల్వేట్రాక్‌పై దొరికిన తర్వాత అప్పటి వరకూ ఆచూకిలేని కుటుంబసభ్యులు బెంగుళూరులోని మార్చురీ వద్దకు వెళ్లి ఏకే రావును గుర్తుపట్టారు.

singer harini rao
తండ్రితో హరిణి

'జ్యో అచ్యుతానంద', 'సీత ఆన్​ ది రోడ్'​, 'పరిణయం' వంటి చిత్రాల్లో పాటలు పాడింది హరిణి రావు.

Last Updated :Nov 25, 2021, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.