'అఖండ' ప్రీ రిలీజ్​కు గెస్ట్​గా ఐకాన్ స్టార్

author img

By

Published : Nov 25, 2021, 8:28 PM IST

Updated : Nov 25, 2021, 8:48 PM IST

akhanda pre release event allu arjun

నందమూరి బాలయ్యతో పాటు బన్నీ ఫ్యాన్స్​కు అదిరిపోయే వార్త ఇది. ఈ హీరోలిద్దరూ ఒకే వేదికపై అభిమానులకు కనువిందు చేయనున్నారు.

నందమూరి బాలకృష్ణ 'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు వచ్చే అతిథి ఎవరో తెలిసిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్​ అని చిత్రబృందం ప్రకటించింది. నవంబరు 27న హైదరాబాద్​లోని శిల్పాకళా వేదికలో ఈ ఈవెంట్ జరగనుంది.

akhanda pre release event allu arjun
'అఖండ' ప్రీ రిలీజ్​కు గెస్ట్​గా అల్లు అర్జున్

ఇప్పటికే విడుదలైన 'అఖండ' ట్రైలర్.. అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. డిసెంబరు 2న సినిమా థియేటర్లలోకి వస్తుంది.

మరోవైపు అల్లు అర్జున్ 'పుష్ప'తో బిజీగా ఉన్నారు. తుదిదశ కార్కక్రమాల్లో ఉన్న ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక హీరోయిన్. సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఓవైపు హీరోగా సినిమాలు చేస్తున్న బాలయ్య.. అల్లు అరవింద్ 'ఆహా' ఓటీటీలో 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' అనే టాక్ షో చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్​ను 'అఖండ' ప్రీ రిలీజ్​కు గెస్ట్​గా పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో అటు 'అఖండ'తో పాటు 'పుష్ప' కూడా ప్రచారమవుతుంది!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated :Nov 25, 2021, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.