Live: తుళ్లూరులో అక్రమ అరెస్టులను ఖండించిన న్యాయవాది శ్రవణ్కుమార్
Published: May 24, 2023, 4:26 PM

రాజధాని అంటే మా పొలాలు ఇచ్చాం.. ఇప్పుడు ఏ దిక్కూ లేక మా పిల్లలకు ఏమీ పెట్టలేకపోతున్నాం.. వాళ్లు అన్యాయమై పోతున్నారు.. ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేయండి.. అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను కొంగుతో తుడుస్తూ రాజధాని మహిళా రైతులు బోరుమన్నారు. శాంతి భద్రతల నెపంతో వందలాది మంది పోలీసులు ఒక్క సారిగా దీక్ష శిబిరంపై దాడి చేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. అహింసా పద్ధతిలో శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. రైతులను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు... వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా లాగి పడేశారు. ఊహించని పరిణామంతో రైతులు, వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
మరోవైపు తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉద్దండ రాయినపాలెంలో పులి చిన్నా ను బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. కాగా, శాంతి యుతంగా దీక్షలో పాల్గొన్న వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. రైతులను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు... వృద్ధులు, మహిళలని చూడకుండా లాగి పడేశారు. పోలీసుల వైఖరిపై రాజధాని రైతులు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, రాజధాని కోసం భూములివ్వడమే మా తప్పా? అని నిలదీశారు. అధికారం ఉందని ఇష్టానుసారం ప్రవర్తిస్తారా?.. మహిళలనీ చూడకుండా లాగి పడేస్తారా?.. భూములిస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఆర్5 జోన్ సృష్టించి భూములిస్తారా? అని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తుళ్లూరులో అంబేడ్కర్ విగ్రహానికి న్యాయవాదులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు న్యాయవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని పీఎస్కు తరలించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్కుమార్ అరెస్టు చేశారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారని జడ శ్రావణ్కుమార్ మండిపడ్డారు.