LIVE: దిల్లీ వేదికగా జీ20 సదస్సు.. ప్రత్యక్ష ప్రసారం
Published: Sep 9, 2023, 9:26 AM

G20 Summit India 2023 LIVE : జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు దిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండురోజులపాటు జరగనున్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ-20 దేశాల కూటమి ప్రభుత్వాల కలయికతో ఏర్పడిన వేదిక. జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు ప్రతినిధులుగా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థికస్థిరత్వం, వాతావరణ మార్పుల తీవ్రత తగ్గింపు, సుస్థిరాభివృద్ధి వంటి అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ప్రధాన సవాళ్లను అధిగమించేందుకు ఈ కూటమి పనిచేస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అత్యధిక దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు జీ-20 కూటమిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థూల ఉత్పాదకతలో 80శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింటి రెండో వంతు, ప్రపంచ విస్తీర్ణంలో 60శాతంగా ఉన్నాయి.