శ్రీలంకలో హింస.. రాజపక్స ఇంటికి నిప్పు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం

author img

By

Published : May 10, 2022, 6:45 AM IST

Sri Lanka PM resigns, Rajapaksa family hoSri Lanka PM resigns, Rajapaksa family home burnt downme burnt down

Srilanka Crisis: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహీంద రాజపక్స వెనక్కితగ్గి.. తన పదవికి రాజీనామా చేశారు. నిరసన కారులు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలపై విధ్వంసానికి దిగారు. హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల ఇంటిని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు తగలబెట్టి విధ్వంసం సృష్టించారు.

Srilanka Crisis: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసన జ్వాలలకు ప్రధానమంత్రి మహీంద రాజపక్స తలొగ్గి.. ఎట్టకేలకు తన పదవి రాజీనామా కూడా చేశారు. అంతకుముందు, కొలంబోలో ప్రధాని మహీంద రాజపక్స నివాసం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడం వల్ల శ్రీలంక ఒక్కసారిగా భగ్గుమంది. ఇరు వర్గాల ఘర్షణలతో కొలంబో నగరం అట్టుడికింది. ఈ ఘర్షణల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకొరాల ప్రాణాలు కోల్పోయారు.

రాజపక్స పూర్వీకుల ఇల్లు ధ్వంసం.. పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలపై ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. మాజీ మంత్రి జాన్‌స్టన్‌ ఫెర్నాండోకు చెందిన కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆయనకు చెందిన హోటళ్లకు కూడా నిప్పంటించారు. మాజీ మంత్రి నిమల్‌ లాన్‌జా ఇంటిపైనా దాడి చేశారు. మొరటువా మేయర్‌ సమన్‌ లాల్‌ ఫెర్నాండో ఇంటికి నిప్పటించారు. కొలంబోలో అధికార పార్టీ కార్మిక నేత మహింద కహండగామగె ఇంటిపైనా దాడి చేశారు. అలాగే, వలాల్‌వటియా ప్రదేశీయ సభ ఛైర్మన్‌ ఉడెని అతుకొరాల ఇంటిపైనా నిరసనకారులు దాడి చేశారు. హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల ఇంటిని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు తగులబెట్టారు. కురునెగలలోని ప్రధాన మంత్రి మహీందా ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించారు. హంబన్‌టోటలోని మెదములానాలో.. మహీందా, గొటబాయ తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన రాజపక్స మెమోరియల్‌ను కూడా ధ్వంసం చేశారు నిరసనకారులు.

జలఫిరంగులను ఉపయోగించినా.. అంతకుముందు, కొలంబోలోని మైనాగోగామా, గొటాగోగామా పేరుతో ఏర్పాటు చేసుకున్న శిబిరాలపై నిరసనకారులు విరుచుకుపడ్డారు. శ్రీలంక ప్రధాని అధికారిక నివాసం టెంపుల్ ట్రీస్ వెనుక గేటు దగ్గర అగ్నిప్రమాదం జరిగినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. పోలీసులు జలఫిరంగులును సైతం ప్రయోగించారు. బాదుల్లా జిల్లా పార్లమెంటేరియన్ తిస్సా కుట్టియారాచ్ ఇంటిపై కూడా నిరసనకారులు దాడి చేసి, ఆపై నిప్పంటించారు. దాడిలో పుట్టలం ఎంపీ శాంత నిశాంత ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. హింసాత్మక ఘర్షణల తర్వాత దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి: శ్రీలంక ప్రధాని రాజీనామా.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ.. రంగంలోకి సైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.