అఫ్గాన్​లో బాంబు దాడి.. ఏడుగురు దుర్మరణం.. 41మందికి తీవ్ర గాయాలు

author img

By

Published : Sep 23, 2022, 6:00 PM IST

Updated : Sep 23, 2022, 9:13 PM IST

kabul blast

అఫ్గానిస్థాన్​.. కాబూల్​లోని ఓ మసీదు సమీపంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 41 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్‌ మరోమారు బాంబు దాడితో దద్దరిల్లింది. ఓ మసీదుకు సమీపంలో జరిగిన పేలుళ్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 41మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుళ్ల అనంతరం.. ఘటనాస్థలిలో దట్టంగా పొగలు అలుముకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మసీదులో ప్రార్థనలు ముగించుకొని బయటకు వెళ్లే వారు లక్ష్యంగా బాంబు పేలుడు జరిగినట్లు కాబూల్‌ పోలీసు చీఫ్‌ ఖలీద్‌ జద్రాన్‌ తెలిపారు. దాడులకు సంబంధించి.. ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు తాలిబన్ల ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 'హిజాబ్' ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్​.. 26 మంది మృతి

ఉక్రెయిన్​ ప్రాంతాలు రష్యాలోకి.. రెఫరెండం స్టార్ట్.. బూటకమన్న ఉక్రెయిన్

Last Updated :Sep 23, 2022, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.