ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 27 మంది దుర్మరణం

author img

By

Published : Sep 18, 2022, 11:37 AM IST

Updated : Sep 18, 2022, 11:54 AM IST

china bus accident

హైవేపై బస్సు బోల్తా పడిన ఘటనలో 27 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. చైనాలోని సండూ కౌంటీలో ఆదివారం జరిగిందీ ప్రమాదం.

చైనాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. గుయ్​ఝౌ రాష్ట్ర రాజధాని గుయాంగ్​ నగరంలోని సండూ కౌంటీలో ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. ఎక్స్​ప్రెస్​వేపై బస్సు బోల్తా పడిన సమయంలో అందులో 47 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated :Sep 18, 2022, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.