అంధకారంలో పాకిస్థాన్​.. ప్రధాన నగరాలకు పవర్ కట్

author img

By

Published : Jan 23, 2023, 11:35 AM IST

Power outage in major cities of Pakistan from the morning

పాకిస్థాన్​లోని ప్రధాన నగరాల్లో విద్యుత్ అంతరాయం తలెత్తింది. సోమవారం ఉదయం నుంచి ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్​లకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్​మిషన్లలో వచ్చిన లోపం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పటికే పిండి సంక్షోభంతో సతమతమవుతున్న పాక్​లో విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి దేశంలోనే అనేక ప్రధాన నగరాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్​మిషన్లలో లోపాల వల్ల ఈ అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. కరాచి, లాహోర్​ లాంటి ప్రధాన నగరాలలో విద్యుత్​ అంతరాయం ఏర్పడిందని పాకిస్థాన్​కు చెందిన స్థానిక మీడియా తెలిపింది.

"పాకిస్థాన్​లోని పలు ప్రాంతాలలో విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య ఎందుకు వచ్చిందో, ఎక్కడ అంతరాయం కలిగిందో తెలుసుకుంటున్నాము. ఈ సమస్యను పరిష్కరిస్తామని" విద్యుత్ అధికారులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. గుడ్డు నుంచి క్వెట్టాకు రెండు ట్రాన్స్‌మిషన్ లైన్లలో అంతరాయం ఏర్పడటం వల్ల విద్యుత్​ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. క్వెట్టా సహా బలూచిస్థాన్‌లోని 22 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా లేదని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ పేర్కొంది.

దేశంలో ఫారెన్​ నిల్వలు పడిపోవడం వల్ల పాక్ పలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. పాకిస్థాన్ ఈ నెలలో కొత్త ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గత ఏడాది అక్టోబరులో పాకిస్తాన్ విద్యుత్తు అంతరాయాన్ని ఎదుర్కొంది. దీని వలన దేశంలోని పెద్ద ప్రాంతాలు, ప్రావిన్షియల్ రాజధానులు కరాచీ, లాహోర్‌లో 12 గంటలకు పైగా విద్యుత్​ అంతరాయం కలిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.