ఇజ్రాయెల్​ దాడిలో ప్రముఖ జర్నలిస్ట్​ మృతి

author img

By

Published : May 11, 2022, 12:03 PM IST

Al-Jazeera reporter killed

Israeli Palestinian conflict: ఆక్రమిత జెనిన్​ నగరంలో ఇజ్రాయెల్​ బలగాలు చేపట్టిన దాడుల్లో ప్రముఖ జర్నలిస్ట్​ షిరీన్​ అబు ఆక్లే ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో జర్నలిస్ట్​ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. మరోవైపు.. పాలస్తీనా వాదనలను తోసిపుచ్చింది ఇజ్రాయెల్​.

Israeli Palestinian conflict: పాలస్తీనా పశ్చిమ ప్రాంతంలోని జెనిన్​ నగరంపై ఇజ్రాయెల్​ చేపట్టిన దాడిని కవర్​ చేసేందుకు వెళ్లిన ఆల్​-జజీరా జర్నలిస్ట్​ను కాల్చి చంపినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. దాడి ప్రారంభమైన కొద్దిసేపటికే అరబిక్​ ఛానల్​ రిపోర్టర్ షిరీన్​ అబు ఆక్లే మృతి చెందినట్లు వెల్లడించింది. జరుసలేంకు చెందిన అల్​ క్వాడ్స్​ వార్తాపత్రికలో పని చేస్తున్న పాలస్తీనా జర్నలిస్ట్​ సైతం గాయపడ్డారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్​ చేసిన దాడిలోనే జర్నలిస్టులకు తూటాలు తగిలాయని తెలిపింది. వారు ధరించిన దుస్తులపై స్పష్టంగా ప్రెస్​ అని రాసి ఉన్నట్లు పేర్కొంది.

Al-Jazeera reporter killed
జర్నలిస్ట్​ మృతదేహాన్ని తరలిస్తున్న పాలస్తీనా అధికారులు

మరోవైపు.. జెనిన్​లో ఉన్న తమ బలగాలపై తుటాలు, బాంబులతో విరుచుకుపడ్డారని.. అందుకే తాము ఎదురుదాడి చేసినట్లు పేర్కొంది ఇజ్రాయెల్​ మిలిటరీ. జర్నలిస్ట్​ మృతిపై దర్యాప్తు చేపడతామని, పాలస్తీనా సైనికుడే వారిపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది.

కొద్ది వారాలుగా ఆక్రమిత వెస్ట్​బ్యాంక్​ ప్రాంతంలో ప్రతిరోజు దాడులు చేస్తోంది ఇజ్రాయెల్​. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్​లో అంతర్గత దాడులు జరుగుతుండటం గమనార్హం. చాలా వరకు దాడులు పాలస్తీనీయన్లు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంటోంది. శరణార్థుల క్యాంప్​గా మారిన జెనిన్​ నగరాన్ని మిలిటరీ స్థావరంగా మార్చుకుంది ఇజ్రాయెల్​. 1967లో వెస్ట్​బ్యాంక్​ ప్రాంతాన్ని ఆక్రమించింది.

ఇదీ చూడండి: Israel palestine clashes: పాలస్తీనా వ్యక్తిని కాల్చి చంపిన ఇజ్రాయెల్ బలగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.