పోలీసు వాహనంపై దాడి.. 8 మంది మృతి.. నది దాటుతూ మరో ఎనిమిది మంది

author img

By

Published : Sep 3, 2022, 11:03 AM IST

explosive attack in Colombi

Explosive Attack In Colombia: కొలంబియాలో పోలీసు వాహనంపై జరిగిన దాడిలో ఎనిమిది మరణించారు. ఈ ఘటన పట్ల కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోవైపు, నది దాటుతున్న వలసదారుల్లో ఎనిమిది మంది నీటిలో మునిగి మరణించారు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్​లో జరిగింది.

Explosive Attack In Colombia: నైరుతి కొలంబియాలో పోలీసు వాహనంపై జరిగిన పేలుడు పదార్థాల దాడిలో 8 మంది అధికారులు మరణించారని ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో శుక్రవారం తెలిపారు. ఈ దాడిని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఈ చర్యలు శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదని పెట్రో చెప్పారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా- పీపుల్స్ ఆర్మీ అనే గెరిల్లా గ్రూపు క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

కొలంబియా అధ్యక్షుడిగా ఆగస్టు 7న గుస్తావో పెట్రో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దేశ చరిత్రలో మొదటి వామపక్ష నాయకుడు. పేదరికాన్ని అరికడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే గెరిల్లా పోరాట యోధులతో చర్చలకు జరుపుతానని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులపై దాడి జరగడం గమనార్హం.

Migrants Dead in Texas: అమెరికా టెక్సాస్​లో ఘోరం జరిగింది. ఈగిల్ పాస్ సమీపంలోని రియో గ్రాండే నదిలో మునిగి 8 మంది వలసదారులు మరణించారు. ఈ విషయాన్ని అమెరికా సరిహద్దు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆరు మృతదేహాలను తాము వెలికితీయగా.. మెక్సికన్ బృందాలు మరో రెండు మృతదేహాలను బయటకు తీశాయని అధికారులు తెలిపారు. అధిక వర్షాల కారణంగా ప్రవాహం పెరిగిందని.. అందుకే వలసదారులు నదిని దాటే సమయంలో మరణించినట్లు పేర్కొన్నారు. వలసదారులు ఏ దేశం నుంచి వచ్చారో ఇంకా తెలియలేదని అమెరికా అధికారులు తెలిపారు. నీటిలో మునిగిన 37 మంది బాధితుల్ని కాపాడామని చెప్పారు. సరిహద్దుకు ఇరువైపులా బాధితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

ఇవీ చదవండి: సొంతగడ్డపై కాలుమోపిన గొటబాయ.. 50 రోజుల తర్వాత శ్రీలంకకు

పాక్​లో వరదలకు హిమాలయాలూ ఓ కారణమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.