విమానంలో 122 మంది.. టేకాఫ్​ సమయంలో చెలరేగిన మంటలు!

author img

By

Published : May 12, 2022, 10:13 AM IST

Updated : May 12, 2022, 2:31 PM IST

China Plane Crash

విమానం టేకాఫ్​ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలో జరిగింది.

China Plane Crash: చైనాలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతున్న విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే, సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 40 మందికిపైగా గాయపడ్డారు. టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నింగ్చి ప్రాంతానికి బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్‌ అవుతుండగా ఒక్కసారిగా దిశ మార్చుకుంది. విమానంలో అసాధారణ పరిస్థితులను గుర్తించిన సిబ్బంది వెంటనే టేకాఫ్‌ కాకుండా నిలిపివేశారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు.

టేకాఫ్​ అవుతుండగా విమానంలో మంటలు

మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని వెనుకవైపు ఉన్న అత్యవసర ద్వారం నుంచి నుంచి కిందకు పంపించేశారు. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంటల్లో విమానం కాలిపోతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

China Plane Crash
విమానంలో మంటలు
చైనాలో ఇటీవలే ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మార్చి 12న కున్మింగ్‌ నుంచి గాంగ్ఝౌ వెళ్తున్న విమానం గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 132 మంది ప్రయాణికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు.

ఇవీ చూడండి: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు.. కఠిన చర్యలకు కిమ్​ ఆదేశం

శ్రీలంక కొత్త ప్రధాని కోసం చర్చలు.. రంగంలోకి సైన్యం

Last Updated :May 12, 2022, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.