బస్సును ఢీకొట్టిన రైలు.. 11 మంది మృతి.. ఐదుగురికి గాయాలు

author img

By

Published : Jul 30, 2022, 1:57 PM IST

Bangladesh Train Bus Accident

Train Bus Accident: రైల్వే క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును రైలు బలంగా ఢీకొన్న ఘటన బంగాదేశ్​లోని చిట్టగాంగ్​ జిల్లాలో జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు.

Bangladesh Train Bus Accident: బంగ్లాదేశ్​లోని చిట్టగాంగ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే లెవల్​ క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును వేగంగా దూసుకొస్తున్న ఓ రైలు ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు సహా 11 మంది అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చిట్టగాంగ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

ఓ కోచింగ్​ సెంటర్​ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ప్రయాణిస్తున్న మినీబస్సును ఢాకా వైపు వెళ్తున్న ప్రోవతి ఎక్స్‌ప్రెస్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మరణించినవారిలో ఏడుగురు ఒకే వయస్సు గల విద్యార్థులు ఉన్నారని, నలుగురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారని చెప్పారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.

ఇవీ చదవండి: 'జైలుపై ఉక్రెయిన్​ బాంబు దాడి.. 40 మంది మృతి.. అందరూ సొంతవాళ్లే!'​

'నిప్పుతో చెలగాటం వద్దు.. అది మీకే ప్రమాదం'.. అమెరికాకు జిన్​పింగ్ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.