Modi Gift: కమలా హారిస్​కు మోదీ అపూర్వ కానుక

author img

By

Published : Sep 24, 2021, 4:00 PM IST

Updated : Sep 24, 2021, 5:17 PM IST

modi news

అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​కు అపూర్వ కానుక (Modi Gift) ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​లో పనిచేసిన ఆమె తాతకు సంబంధించిన అమూల్యమైన పత్రాలను అందించారు. క్వాడ్​ కూటమి నేతలైన ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులకు కూడా కానుకలిచ్చారు మోదీ.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ సహా క్వాడ్​ దేశాధినేతలకు ప్రత్యేకమైన కానుకలు (Modi Gift) ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత ప్రభుత్వంలో పనిచేసిన కమల తాత పీవీ గోపాలన్​కు సంబంధించిన పాత నోటిఫికేషన్​ల ప్రతిని హస్తకళతో చేసిన చెక్క ఫ్రేమ్​లో కమలకు బహూకరించారు మోదీ. ప్రభుత్వాధికారిగా గోపాలన్​ వివిధ హోదాల్లో పనిచేశారు.

modi news
మోదీ కానుక

భారతీయ హస్తకళ..

దాంతో పాటే గులాబీ 'మీనాకారి' చెస్​ సెట్​ను కూడా హారిస్​కు (Kamala Harris News) కానుకగా ఇచ్చారు మోదీ. ఈ మీనాకారి కళకు, మోదీ నియోజకవర్గమైన కాశీకి దగ్గరి సంబంధం ఉంది. ఈ చెస్ సెట్​ కూడా హస్తకళాకారులు చేసిందే.

శ్వేతసౌధంలో కమలతో గురువారం భేటీ అయిన మోదీ (Modi US Visit).. అమెరికా-భారత్​ సహజసిద్ధ భాగస్వాములని అభివర్ణించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. దేశంలో కరోనా రెండో దశ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా(Modi Us Visit 2021) కమలా హారిస్‌ను ప్రధాని మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు.

మీనాకారి పడవ..

తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో (QUAD Summit 2021) పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. గురువారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​తో భేటీ అయ్యారు. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై వారు చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

modi news
మోదీ కానుక

ఈ సందర్భంగా మోరిసన్​కు వెండి గులాబీ మీనాకారి పడవను కానుకగా ఇచ్చారు మోదీ. హస్తకళతో చేసిన ఈ పడవ కూడా కాశీ విశిష్టతను తెలియజేసేలా ఉంటుంది.

బౌద్ధం గుర్తుగా..

జపాన్ ప్రధాని యోషిహిదే సుగాకు గంధపు చెక్కతో చేసిన బుద్ధ విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు మోదీ. భారత్​, జపాన్​ను దగ్గర చేయడంలో బౌద్ధం కీలక పాత్ర పోషించింది.

modi news
మోదీ కానుక

సుగాతో భేటీ సందర్భంగా ఇండో పసిఫిక్​ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలపై చర్చ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

రాత్రికి బైడెన్​తో భేటీ..

శుక్రవారం రాత్రి 8.30 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం శ్వేతసౌధంలో జరగనుంది. వీరి భేటీ గంటసేపు కొనసాగనుంది. ఆ తర్వాత మోదీ పర్యటన ఇలా సాగనుంది.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్థాన్​.. పర్యవేక్షణ అవసరం'

Last Updated :Sep 24, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.