నా ఇల్లు అమ్ముకున్నా.. పగవాడికి కూడా నా కష్టాలు రాకూడదు: మోహన్ బాబు

author img

By

Published : Mar 18, 2023, 10:59 PM IST

Updated : Mar 19, 2023, 7:03 AM IST

Mohanbabu 71 birthday shares his critical days

​ వెండితెర విలక్షణ నటుడు డైలాగ్​ కింగ్ మోహన్​బాబు తన కెరీర్​లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. తాను ఎదుర్కొన్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదని అన్నారు. ఆ సంగతులు..

టాలీవుడ్​ వెండితెరపై విలక్షణ నటుడు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. తనదైన విలనిజం, హీరోయిజంతో.. చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కెరీర్​లో ఎన్నో చిత్రాల్లో నటించి 'డైలాగ్​ కింగ్'​గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. అయితే ఆయన ఆదివారం(మార్చి 19) తన 71వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా.. ఓ యూట్యూబ్​ ఛానల్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన సినీ కెరీర్​లో ఎదుర్కొన్న కష్టాలను, అనుభవాలను తెలిపారు. తాను ఎదుర్కొన్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదని అన్నారు.

"మీకు నేను పైకి బాగానే కనిపించొచ్చు. కానీ నా సినీ కెరీర్​లో ఎదురైన ఇబ్బందుల వల్ల ఓ దశలో నా ఇల్లు కూడా అమ్ముకున్నాను. అయితే అప్పుడు ఏ ఒక్కరు కూడా నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాను. నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదని అని అనుకుంటుంటాను. రీసెంట్​గా నేను తీసిన సన్​ ఆఫ్ ఇండియా, జిన్నా సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి." అని తన లైఫ్​లో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చారు మోహన్​బాబు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో రాజకీయ విషయాలు, చిరంజీవితో విభేధాలు వంటి సంగతులను చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, మోహన్​బాబు 1952లో జన్మించారు. రాయలసీమలోని మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్​గా కెరీర్ ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'స్వర్గం-నరకం' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. తనదైన నటనతో ప్రతినాయకుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, హాస్యనటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, పొలిటీషియన్​గా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేశారు. అలాగే సినిమాలపై ఉన్న ఆసక్తి, ప్రేమతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్​ను స్థాపించి 50కి పైగా చిత్రాలను రూపొందించారు. అలానే శ్రీ విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎందరో విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు.

అయితే ఇటీవేల మోహన్​ బాబు ఇంటి పెళ్లి భాజాలు మోగాయి. ఆయన రెండో కుమారుడు మంచో మనోజ్.. వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. తన ప్రేయసి మోనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. దగ్గరుండి మనోజ్​ వివాహ వేడుకల బాధ్యతలను ఆయక అక్క మంచు లక్ష్మి.. చూసుకున్నారు.

Last Updated :Mar 19, 2023, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.