SSMB 29లో హాలీవుడ్​ బ్యూటీ.. జక్కన్న స్కెచ్​ మామూలుగా లేదుగా!

author img

By

Published : Mar 17, 2023, 10:26 AM IST

director rajamouli big sketch hollywood actress in ssmb 29

టాలీవుడ్​ స్టార్​ హీరో మహేశ్​ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే SSMB 29 కోసం జ‌క్క‌న్న భారీ స్కెచ్‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. మహేశ్​ సరసన హాలీవుడ్​ బ్యూటీకి రంగంలోకి దింపనున్నారట.

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి.. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆర్​ఆర్​ఆర్​ చిత్రానికి ఏకంగా ఆస్కార్​ అవార్డు రావడం వల్ల ఓ రెేంజ్​లో గుర్తింపు సంపాదించుకున్నారు. హాలీవుడ్​ దిగ్గజాలు సైతం జక్కన్నను కొనియాడారు. ఇప్పుడు అందరి దృష్టి.. ఆయన నెక్స్ట్​ సినిమాపైనే ఉంది. ఇప్ప‌టికే మ‌న జ‌క్క‌న్న సూప‌ర్ స్టార్ మ‌హేశ్​ బాబుతో తదుప‌రి సినిమా ఉంటుంద‌ని అనౌన్స్ చేసేశారు. చేయ‌ట‌మే కాదు.. దానికి సంబంధించిన క‌థ‌ను రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి తండ్రి, పాన్ ఇండియా రైట‌ర్ అయిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌న్నీ ఓ ఎత్తు.. ఆస్కార్ అవార్డు వరించిన త‌ర్వాత చేస్తున్న SSMB 29 మ‌రో ఎత్తు. అందుకోసం రాజ‌మౌళి భారీ స్కెచ్​లు వేస్తున్నారు. ఏకంగా ఈసారి హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్‌తో పాటు టెక్నీషియ‌న్స్‌తోనూ చేతులు క‌లుపుతున్నారు. ఇప్ప‌టికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో అగ్రిమెంట్​ చేసుకున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్ర‌ముఖ‌ హాలీవుడ్ న‌టీన‌టుల‌ను ఈ సినిమాలో న‌టించడానికి ఒప్పిస్తుంది. దాంతో పాటు ఈ సినిమాలో థోర్ మూవీ యాక్ట‌ర్ క్రిస్ హెమ్స్ వ‌ర్త్ న‌టిస్తార‌నే టాక్ ఉంది.

కాగా.. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ భామ‌ను రంగంలోకి దించుతున్నార‌ట జ‌క్క‌న్న‌. ఇది తెలిసిన ఫ్యాన్స్​.. జ‌క్క‌న్న స్కెచ్ మామూలుగా లేదురోయ్ అని అనుకుంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను చేసి వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలో SSMB 29ను తెర‌కెక్కించేలా రాజ‌మౌళి ప్లాన్ చేసుకున్నారట.

జేమ్స్ బాండ్‌, ఇండియానా జోన్స్ త‌ర‌హా యాక్ష‌న్ మూవీని మ‌హేశ్​తో చేయ‌డానికి రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. గ్లోబెల్ రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా SSMB 29ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే ద‌ర్శ‌క ధీరుడు కొన్ని ఇంట‌ర్వ్యూల్లో తెలియ‌జేశారు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.ఎల్.నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ మూవీ కాబ‌ట్టి మినిమం బ‌డ్జెట్టే రూ.500 కోట్లు అని టాక్‌. మ‌రి మేకింగ్‌లో ఇదెంత మేర‌కు పెరుగుతుందో చూడాలి మ‌రి.

ఇక, సినిమాల విషయానికొస్తే.. మహేశ్​ బాబు సర్కారు వారి పాట మూవీ తర్వాత మాటల మాంత్రికుడు తివ్రిక్రమ్​తో చేతులు కలిపారు. SSMB 28 వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే మహేశ్​- తివ్రిక్రమ్ కాంబినేషన్​లో ఇదివరకే అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.