''నా పేరు సూర్య' సినిమా బన్నీతో చేయాల్సింది కాదు.. ఆయనే హీరో అనుకున్నా.. కానీ'

author img

By

Published : Nov 22, 2022, 10:28 AM IST

ali tho sardaga show vakkantham vamsi as guest jr-ntr-was-first-choice-naa-peru-surya-na-illu-india

సినీ రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు గెస్ట్​గా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'నా పేరు సూర్య' సినిమా అనుకోకుండా అల్లుఅర్జున్​ చేతిలో వెళ్లిందని తెలిపారు. మరి ఆ సినిమాను ఆయన ఎవరితో చేయాలనుకున్నారంటే?

Ali Tho Saradaga Vakkantham Vamsi: తెలుగుతెరపై స్క్రీన్ రైటర్​గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వక్కంతం వంశీ. ఎక్కువగా సురేందర్ రెడ్డి సినిమాలకు వంశీ కథలు అందించారు. ఆ తరువాత మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగాను అదృష్టం పరీక్షించుకున్నారు. తాజాగా ఈ స్టార్ రైటర్ తన భార్య శ్రీవిద్యతో కలిసి ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' సెలబ్రెటీ టాక్ షోకు ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరో అల్లుఅర్జున్​తో 'నాపేరు సూర్య' సినిమా చేసే అవకాశం ఎలా వచ్చిందో వివరించారు.

'ఆలీతో సరదాగా'షోలో వక్కంతం వంశీ పంచుకున్న విషయాలు

"దర్శకుడిగా సినిమా తెరకెక్కించాలని ఐదేళ్లుగా నేను సిద్ధమవుతున్నాను. చెప్పాలంటే 'నాపేరు సూర్య' సినిమా తారక్​తో చేయాల్సింది. ఆయనే నన్ను డైరెక్టర్​గా చేస్తానన్నారు. తన కోసమే కథ రాసుకున్నా. ఎన్టీఆర్​ ఆర్ట్స్​ బ్యానర్​పై సినిమా తెరకెక్కాలి. కథ విషయంలో కాస్త ఇబ్బంది వచ్చింది. అలా ఆ కథ పక్కన పెట్టా. ముందు ఏదో సినిమా ఒకటి చేద్దామని ఆ తర్వాత మళ్లీ రాశాను. అదే సమయంలో బన్నీ కోసం రేసుగుర్రం సినిమా కోసం స్టోరీ రాస్తున్నాను. అలా బన్నీతో పరిచయం ఉండడంతో నాపేరు సూర్య కథ ఆయనకు చెప్పా. వెంటనే ఆయన ఓకే చెప్పారు."

-- వక్కంతం వంశీ, దర్శకుడు

సురేంద్ర రెడ్డితో పరిచయం ఎలా ఏర్పడిందని వ్యాఖ్యాత ఆలీ ప్రశ్నించారు. "సురేంద్ర రెడ్డితో నాకు పరిచయం ఎన్టీఆర్​ వల్లే. అశోక్​ సినిమా ద్వారా ఇద్దరం కలిశాం. అయితే ఆ సినిమా పెద్ద హిట్​ అవ్వలేదు. ఫ్లాప్​ అవ్వలేదు. ఆ తర్వాత సురేంద్రరెడ్డి మహేశ్​ బాబుతో అతిథి సినిమా తీస్తున్నారు. ఆ సమయంలో నన్ను కూడా పిలిచారు. హెల్ప్​ కోసం వెళ్లా. కానీ నేను తర్వాత అలా చేయొద్దనుకున్నా. అందుకు సురేంద్ర రెడ్డి ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇద్దరం కలిపి ఓ సినిమా చేసి హిట్​ కొట్టాలని అన్నారు. అప్పుడే 'కిక్' సినిమా​ ఐడియా వచ్చి చెప్పా. ఆయన బ్రహ్మాండంగా తీశారు. సినిమాలో అన్ని క్యారెక్టర్లకు ఇప్పటికీ ఫుల్​ ఫ్యాన్స్​ ఉన్నారు. నాకు జీవితంలో ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన సినిమా 'కిక్'​".

అయితే వంశీ రైటర్, డైరెక్టర్ గానే కాదు హీరోగా కూడా ఒక సినిమా చేశారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో యాంకర్ సుమ హీరోయిన్​గా, వక్కంతం వంశీ హీరోగా 'కల్యాణ ప్రాప్తిరస్తు' అనే చిత్రం తెరకెక్కించిన విషయాన్ని ఆలీ గుర్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.