అకీరా కోసం రంగంలోకి అడివి శేష్.. గ్రాండ్​గా ఎంట్రీ ప్లాన్​!​

author img

By

Published : Nov 23, 2022, 8:15 PM IST

Etv BharatAdavi sesh akira movie

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ తనయుడు అకీరా నందన్​ సిల్వర్​స్క్రీన్​ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే అది కార్యరూపం దాల్చనుందని, ఇందుకోసం యంగ్ హీరో అడివి శేష్​ కథ అందించబోతున్నారని తెలిసింది.

ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంత స్నేహం ఉంటుందో.. అలాగే వారి కుటుంబాల మధ్య కూడా అంతే సానిహిత్యం ఉంటుంది. అయితే హీరోలు హీరోలకు మధ్య స్నేహం అనేది మామూలే కానీ.. హీరోల పిల్లలతో మరో కథానాయకుడు స్నేహం చేయడమనేది ఆసక్తికరమైన విషయమే. ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్​ ఫ్రెండ్​షిప్​ అలాంటిదే.

అడివి శేష్-అకీరా నందన్ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వీరిద్దరూ చాలా సార్లు ఒకరి గురించి మరొకరు ప్రస్తావన తీసుకొస్తుంటారు. ముఖ్యంగా అడివి శేష్​కు అకీరా అంటే చాలా ఇష్టం. అకీరా తన తమ్ముడు, బెస్ట్ ఫ్రెండ్ అని అంటుంటాడు. అలాగే అకీరా ఏం చేసినా శేష్ సపోర్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో విష్ చేస్తుంటాడు. అయితే నటుడిగా, రైటర్​గా ఇప్పటికే అడివి శేష్ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కథలను తానే రాసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్​తో దూసుకుపోతున్నాడు. మరోవైపు అకీరా సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ కోసం పవర్​స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో అడివి శేష్​-అకీరా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. అకీరా డెబ్యూ మూవీకి అడివి శేష్ కథను అందించనున్నట్లు సినీవర్గాల సమాచారం. అకీరా కోసం శేష్ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​తో అదిరిపోయే స్టోరీ రెడీ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి: హనుమాన్​ మూవీ బడ్జెట్​ అనుకున్నదాని కన్నా ఆరు రెట్లు ఎక్కువగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.