Complaint: వైకాపా నాయకుడు బెదిరిస్తున్నాడు..పోలీసులకు మహిళ ఫిర్యాదు

author img

By

Published : May 13, 2022, 11:47 AM IST

Complaint

Complaint: వైకాపా నాయకుడు తనను బెదిరిస్తున్నాడని ఓ మహిళ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఓ పాఠశాలలో వంట మనిషిగా పని చేసినప్పుడు.. విద్యార్థుల పట్ల నిర్వాహకుల తీరును వ్యతికేరించినందుకు తనను తొలగించారని తెలిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

Complaint: వైకాపా నాయకుడు మక్బూల్ బాషా బెదిరిస్తున్నాడంటూ అనంతపురం జిల్లా కణేకల్ పోలీస్ స్టేషన్​లో హసీనా అనే మహిళ ఫిర్యాదు చేశారు. కణేకల్ మండలం ఆలూరులోని మదర్సాలో 4నెలలపాటు వంట మనిషిగా పని చేసినప్పుడు.. విద్యార్థుల పట్ల నిర్వాహకుల తీరును వ్యతిరేకించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మక్బూల్ బాషా తనను తొలగించారని.. ఆ తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళితే.. తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని వాపోయారు. మక్బూల్ బాషా తీరుతో భర్త, ఇతర కుటుంబసభ్యులు తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనని బెదిరిస్తున్నాడని.. వైకాపా నాయకుడిపై మహిళ ఫిర్యాదు
ఇవీ చదవండి: SI Suicide: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని.. సర్పవరం ఎస్​ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.