పండగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

author img

By

Published : Jan 15, 2023, 10:48 AM IST

Road Accident

Road Accident: పండుగ వేళ స్నేహితులు ముగ్గురు కలిసి సరదాగా.. దగ్గరలోనున్న ధియేటర్​కు సెకండ్​షో సినిమాకు వెళ్లారు. సినిమా పూర్తైన అనంతరం ఇంటికి బయల్దేరారు.. ఈలోపు రోడ్డు దాటుతున్న సమయంలో ఓ వాహనం మృత్యువు రూపంలో వచ్చింది. అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురు స్నేహితులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.

Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొరపల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వాహనం అతి వేగంతో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులు ఎల్లకృష్ణ, రామకృష్ణ.. నంద్యాల జిల్లాలోని దొరపల్లె గ్రామం వాసులుగా గుర్తించారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి వస్తుండగా జాతీయ రహదారి దాటే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.