బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్‌ మృతి.. అందులో 40 మంది

author img

By

Published : Jan 6, 2023, 4:35 PM IST

Updated : Jan 6, 2023, 5:02 PM IST

road accident

16:30 January 06

చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి యాదగిరిగుట్ట వెళ్తుండగా ఘటన

Bus Accident in Mulugu District: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం వద్ద ఘోర ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి 40 మంది ప్రయాణికులతో యాదాద్రికి ఓ ప్రైవేటు బస్సు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో.. బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌ బాబు (50) అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 6, 2023, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.