చేతబడి చేస్తున్నాడనే నెపంతో రైల్వే ఒప్పంద ఉద్యోగి హత్య.. తోటి కార్మికులే

author img

By

Published : Sep 15, 2022, 4:36 PM IST

Updated : Sep 15, 2022, 6:50 PM IST

railway contract employee

16:33 September 15

ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Murder In West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు సమీపంలోని చిలకపాడులో రైల్వే ఒప్పంద ఉద్యోగి లాల్‌గూరిని తోటి కార్మికులు హత్య చేశారు. చేతబడి అనుమానంతో లాల్​గూరిని హత్య చేసి మృతదేహన్ని రైలు పట్టాలపై పడేశారు. ఈ నెల 12వ తేదిన పోలీసులు మృతదేహన్ని గమనించి.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన ​ లాల్‌గూరి ఝార్ఖండ్‌ చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. గత మూడేళ్లుగా ఇక్కడే ఒప్పంద కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 15, 2022, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.