పండుగ రోజు విషాదం.. గీజర్ పేలి వ్యక్తి మృతి

author img

By

Published : Oct 5, 2022, 7:59 PM IST

blast

Geyser Blast At Satyasai : పండుగ రోజు సత్యసాయి జిల్లలో విషాదం చోటు చేసుకుంది. గీజర్​కు గ్యాస్​ పైపు పెడుతుండగా.. మంటలు చెలరేగడంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

geyser blast : పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో విషాదం నెలకొంది. నంజుండేశ్వర అనే వ్యక్తి.. స్నానం గదిలోని గీజర్​కు.. గ్యాస్ పైప్ అమర్చుతుండగా.. కనెక్షన్ ఊడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నంజుండేశ్వరుడికి తీవ్ర గాయాలవ్వడంతో.. ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.