ప్రీ వెడ్డింగ్ షూట్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి
Updated on: Jan 21, 2023, 9:22 AM IST

ప్రీ వెడ్డింగ్ షూట్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి
Updated on: Jan 21, 2023, 9:22 AM IST
06:16 January 21
ఇల్లందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో లారీ-కారు ఢీ
Bhadradri Accident Today : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఇల్లెందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అక్కడ మరో వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు.
Road Accident in Bhadradri today : రోడ్డు ప్రమాదం సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సంపేటకు చెందిన రణధీర్ను మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. మృతులు హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన అరవింద్, వరంగల్కు చెందిన రాము, కల్యాణ్, శివగా పోలీసులు గుర్తించారు. వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
