Childrens Missing: మున్నేరులో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు వెలికితీత

author img

By

Published : Jan 10, 2022, 7:54 PM IST

Updated : Jan 11, 2022, 10:20 AM IST

Childrens Missing

10:19 January 11

Childrens Missing: మున్నేరులో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు వెలికితీత

మున్నేరులో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
మున్నేరులో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు వెలికితీత

Childrens Missing: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మున్నేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మున్నేరులో ఇసుక కోసం తవ్విన గుంతలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలు బయటకు తీసుకువచ్చారు.

సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి మున్నేరు వాగు వైపు వెళ్లిన పిల్లలు రాత్రి అవుతున్నా.. తిరిగి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లల దుస్తులు.. వారు వేసుకొని వెళ్లిన సైకిళ్లు మున్నేరు వాగు ఒడ్డున ఉండటాన్ని గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులంతా మున్నేరు పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించారు. నిన్న రాత్రి ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. ఈరోజు ఉదయం విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

19:49 January 10

Childrens Missing: చందర్లపాడు మండలం ఏటూరులో ఘటన

Childrens Missing
మున్నేరు పరిసర ప్రాంతాల్లో గల్లంతైన పిల్లల దుస్తులు

గల్లంతైన పిల్లల వివరాలు..

  • చరణ్
  • బాల యేసు
  • అజయ్
  • రాకేశ్
  • సన్ని

ఇదీ చదవండి: మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తల.. హత్యా...? నరబలా..?

Last Updated :Jan 11, 2022, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.