ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి తాళలేక.. ఆ తండ్రి ఎంత పని చేశాడంటే?

author img

By

Published : Sep 19, 2022, 5:13 PM IST

FATHER SUICIDE WITH DAUGHTERS

FATHER SUICIDE : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి.. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య శుభకార్యం కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలను తీసుకుని సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.

FATHER SUICIDE WITH DAUGHTERS : ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి తాళలేక ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజవోలులోని వి.ఎల్‌. పురానికి చెందిన సత్యకుమార్‌ అనే వ్యక్తి.. తన ఇద్దరు కుమార్తెలు రిషిత, హిద్విలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చెరువు వద్ద ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి, కుమార్తెల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. భార్య శుభకార్యం కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు సత్యకుమార్​. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇద్దరు కుమార్తెలతో చెరువులో దూకిన తండ్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.