గురజాల పోలీస్​స్టేషన్​లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి తలకు గాయం

author img

By

Published : Sep 21, 2022, 2:10 PM IST

clashes between two communities in same party

Clashes Between Two Groups : గురజాల పోలీస్ స్టేషన్‌లో రాత్రి 11 గంటల సమయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వైకాపా నాయకులపై.. అదే పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి తలకు గాయమైంది.

Clashes Between Two Groups In Same Party : పల్నాడు జిల్లా గురజాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వైకాపా నాయకులపై అదే పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు దాడి చేశారు. దీంతో ఆ వర్గంలోని ఓ వ్యక్తికి తలకు గాయాలయ్యాయి. గాయపడిన రమణ అనే కార్యకర్తని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో రమణకు చెందిన వర్గం నాయకులు.. మరో వర్గానికి చెందిన వారి ఇంటి ముందు ధర్నా చేశారు. ఆ సమయంలో మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ లోపలే ఇంత జరిగిన పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించినట్లు సమాచారం.

గురజాల పోలీస్​స్టేషన్​లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి తలకు గాయం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.