దర్యాప్తునకు వెళ్లిన కానిస్టేబుళ్లపై తల్వార్​తో దాడి

author img

By

Published : Jan 5, 2023, 7:44 PM IST

ATTACK

A person Attacked Police: తెలంగాణ రాష్ట్రంలోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ఓ కేసు విషయంపై దర్యాప్తు చేసేందుకు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఓ వ్యక్తి తల్వార్​తో దాడికి దిగాడు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A person Attacked Police: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్​ జగద్గిరిగుట్ట పోలీస్​స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఏకంగా పోలీసులనే చంపబోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం రాత్రి నార్సింగి వద్ద బైకుపై వెళ్తున్న ఇద్దరిపై.. దోపిడీ దొంగల ముఠా తల్వార్​లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కిశోర్‌ అనే వ్యక్తి మృతి చెందగా.. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే నిందితుడు జగద్గిరిగుట్టలో ఉన్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది.

ఈ విషయమై మాదాపూర్ ఎస్ఓటీ కానిస్టేబుల్స్ రాజు, విజయ్​లు నిందితుడిని పట్టుకునేందుకు ఆల్విన్ కాలనీకి వెళ్లారు. ఈ క్రమంలోనే కరణ్​సింగ్ తల్వార్​తో వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో రాజుకు ఛాతిపై, తలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయ్​ స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మాదాపూర్‌ మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తల్వార్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.