హైదరాబాద్​లో దారుణం.. రూ.400 కోసం కూలీ హత్య

author img

By

Published : Dec 25, 2022, 5:03 PM IST

హత్య

DAILY LABOUR MURDER: హైదరాబాద్​లో దారుణం జరిగింది. రూ.400 కోసం ఓ కూలీ తన తోటి కూలీని హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

DAILY LABOUR MURDER: హైదరాబాద్‌ బాలానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై పడుకుంటూ రోజువారీ కూలీ పని చేసుకునే ఇద్దరు కూలీలు.. రూ.400 కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాశీరాం, శ్రీనివాస్‌ అనే ఇద్దరు కూలీల మధ్య తమకు ఆదాయంగా వచ్చిన రూ.400 కోసం వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో.. శ్రీనివాస్‌ను కాశీరాం కర్రతో కొట్టాడు. అనంతరం అటుగా వెళ్తున్న లారీ కిందకి అతడిని తోసేశాడు.

దీంతో శ్రీనివాస్‌ తలకి తీవ్ర గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.