KANNABABU: విద్యుత్ కోతలపై తెదేపా అసత్య ప్రచారం: మంత్రి కన్నబాబు

author img

By

Published : Oct 14, 2021, 6:21 PM IST

minister kannababu comments on yanamala

విద్యుత్ కోతలపై తెలుగుదేశం పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు(minister kannababu fire tdp statements on power cut) విమర్శించారు. అమ్మఒడి పథకంపై యనమల దుష్ప్రచారం ఎంతవరకు సబబు అని మంత్రి ప్రశ్నించారు.

విద్యుత్ కోతలపై తెదేపా నేతల అసత్య ప్రచారం

అమ్మఒడి పాత పథకమేనని తెదేపా నేత యనమల రామకృష్ణుడు చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు(minister kannababu comments on yanamala) అన్నారు. అమ్మఒడి పథకంపై యనమల దుష్ప్రచారం ఎంతవరకు సబబు అని కన్నబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్​ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తెదేపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు.

దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం తలెత్తితే.. తెలుగుదేశం పార్టీ నేతలు(minister kannababu fire on tdp leaders) మాత్రం రాష్ట్రంలోనే విద్యుత్ కోతలు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు. విద్యుత్‌ సమస్య మన రాష్ట్రానికే పరిమితం కాదని.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. విదేశాల్లో బొగ్గు డిమాండ్ పెరగడం వల్లే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా మద్యం ధర పెంచామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి...

GAS CYLINDER: గ్యాస్​ లీక్​ వాసన పసిగట్టక.. అంతలోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.