protest: జీవీఎంసీ కార్యాలయం వద్ద దివ్యాంగుల నిరసన

author img

By

Published : Sep 24, 2021, 7:16 PM IST

నిరసన

విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసన (protest) చేపట్టారు. సీజ్ చేసిన తమ పాఠశాలను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్, మేయర్ ఈ విషయంపై స్పందించాలని కోరారు.

జీవీఎంసీ కార్యాలయం వద్ద దివ్యాంగుల నిరసన

విశాఖ జీ‌వీ‌ఎం‌సీ(visakha gvmc) ప్రధాన కార్యాలయం వద్ద హిడ్డెన్ స్పోట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విద్యార్థులు నిరసన(protest) చేశారు. ఎంవీపీ కాలనీలో జీవీఎంసీ అధికారులు సీజ్ చేసిన తమ పాఠశాలను మరల తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అభంశుభం ఎరుగని దివ్యాంగుల నిరసన జీవీఎంసీ కార్యాలయం వద్దకు వచ్చేవారిని కదిలించింది. తమకు పాఠశాల లేకుండా చేయడం సరి కాదని చిన్నారులు కన్నీరు పెట్టుకున్నారు. కమిషనర్, మేయర్ ఈ విషయంపై స్పందించాలని కోరారు.

ఇదీ చదవండి

Avanthi: పరిషత్ విజయం మాపై బాధ్యతను మరింత పెంచింది: అవంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.