CM Jagan on plastic ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన సీఎం జగన్​

author img

By

Published : Aug 26, 2022, 2:06 PM IST

Updated : Aug 26, 2022, 4:15 PM IST

cm jagan

CM Jagan on plastic రాష్ట్రంలో నేటినుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్​ను నిషేధించామన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంతో తిరుమలలో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. తిరుమల స్ఫూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్, పొల్యూషన్ రహిత రాష్ట్రంగా ఏపీ ఉండాలన్నారు.

Plastic Flexies Ban: రాష్ట్రంలో ప్లాస్టిక్‌ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికి తీసేందుకు పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండు నాణేలన్న ఆయన... విశాఖలో పార్లె ఫర్ ది ఓషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. తీరంలో వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆ సంస్థ పని చేస్తోందన్నారు. ఈ ఒప్పందంతో దాదాపు రూ.16 వేల కోట్ల పెట్టుబడులు రాబోయే ఆరేళ్లలో వస్తాయని వివరించారు. ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. 2027నాటికి ఆంధ్రప్రదేశ్‌ ప్లాస్టిక్ పొల్యూషన్‌ ఫ్రీ రాష్ట్రంగా తయారవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్‌ నిషేధించామని.. దీంతో అక్కడ సత్ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. తిరుమల స్ఫూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. మానవ వనరులను అభివృద్ధి చేస్తూ.. వచ్చే తరాలకు చక్కని పర్యావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పర్యావరణం, ఆర్థికాభివృద్ధిని సమానంగా చూస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో కూడా చెత్త సేకరణ బాగా జరుగుతోందన్నారు.

సీఎం జగన్​

"రాష్ట్రంలో నేటినుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నాం. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధించాం. ప్లాస్టిక్‌ నిషేధంతో తిరుమలలో సత్ఫలితాలు వస్తున్నాయి. తిరుమల స్ఫూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. 2027 నాటికి ప్లాస్టిక్, పొల్యూషన్ రహిత రాష్ట్రంగా ఏపీ ఉండాలి." - సీఎం జగన్​

ప్రస్తుతం సముద్రంలో 40 కి.మీ వరకు ప్లాస్టిక్‌ వెళ్లిపోతుందని.. దీనివల్ల చేపలు, సముద్ర వృక్షాలు చనిపోతున్నాయని జగన్‌ అన్నారు. అందుకే 974 కి.మీ సముద్ర తీర ప్రాంతాన్ని ప్లాస్టిక్‌ రహిత ప్రదేశాలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను జీఐఎస్‌పీ, పార్లే ఫర్‌ ఓషన్‌ వర్క్‌ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి అడిడాస్‌, అమెరికా ఎక్స్‌ప్రెస్‌, మెరిసిడెస్‌ బెంజ్‌ సంస్థ ద్వారా ఉత్పత్తుల తయారీకి వినియోగించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో 10ఎకో ఇన్వెన్షన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సముద్ర తీర పరిరక్షణను వాలంటీర్లను తయారు చేస్తారని సీఎం చెప్పారు. విశాఖలో ప్లాస్టిక్‌ను శుద్ధీకరణ, పునరుత్పత్తి, పరిశోధనలను పార్లే సంస్థ త్వరలో ప్రారంభిస్తుందన్నారు. దీంతో రాష్ట్రానికి రూ.16వేల కోట్లు సమకూరుతాయని.. అలాగే, 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్‌ వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 26, 2022, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.