Kollu: "మత్య్సకార జీవనోపాధిని... జగన్ రెడ్డి నిలువునా ముంచారు"

author img

By

Published : May 13, 2022, 6:54 PM IST

Kollu Ravindra

Kollu Ravindra: మత్య్సకార జీవనోపాధిని జగన్ రెడ్డి నిలువునా ముంచారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. మత్య్సకార భరోసా రూ.10వేలు ఇచ్చి పెంచిన ఛార్జీలు, నిత్యావసర ధరలతో ఒక్కో కుటుంబం నుంచి రూ.30 వేలు గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు.

Kollu Ravindra: 217 జీవోతో మత్య్సకార జీవనోపాధిని... జగన్ రెడ్డి నిలువునా ముంచారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మత్య్సకార వృత్తిలో 15 లక్షల మంది ఉండగా మత్య్సకార భరోసా కేవలం లక్షా 8 వేల మందికి మాత్రమే ఇస్తున్నారని ఆక్షేపించారు. మత్య్సకార భరోసా రూ.10వేలు ఇచ్చి పెంచిన ఛార్జీలు, నిత్యావసర ధరలతో ఒక్కో కుటుంబం నుంచి రూ.30 వేలు గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన అనేక పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. కేంద్ర సంస్థ ఓఎన్​జీసీ ఇచ్చిన రూ.108 కోట్లు తాము ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చి మోసపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి... తెదేపా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం దిగజారుడుతనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.