"నాకు ప్రాణాపాయం ఉంది.. భద్రత పెంచండి" డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

author img

By

Published : May 10, 2022, 10:42 PM IST

atchannaidu letter to gdp

Atchenniah Letter To DGP: రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్​ రెడ్డికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తనకు ప్రాణహాని ఉన్నందున అదనపు భద్రత కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్​ రెడ్డికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, ఇతర క్రిమినల్స్​తో తనకు ప్రాణాపాయం ఉందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం తనకు కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నానని.. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభ పక్ష ఉపనేతగానూ వ్యవహరిస్తున్నందున కోరిన మేరకు భద్రత కల్పించాలన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.