సీఎం జగన్​ది సామాజిక న్యాయం కాదు.. సామాజిక ద్రోహం: పంచుమర్తి

author img

By

Published : Jun 23, 2022, 1:50 PM IST

సీఎం జగన్​ది సామాజిక న్యాయం కాదు

ముఖ్యమంత్రి జగన్ చేసేది సామాజిక న్యాయం కాదని.. సామాజిక ద్రోహమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. రిజర్వేషన్లలో కోత విధించి 16,800 మంది బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవటం సామాజిక న్యాయమా ? అని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో 12 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు హత్యకు గురైతే.. నిందితులపై ‎ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

పల్నాడు ప్రాంతంలో 12 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు హత్యకు గురైతే.. నిందితులపై ‎ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాజిక న్యాయం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

పల్నాడులో మారణహోమం సృష్టిస్తున్న పిన్నెల్లిపై చర్యలు తీసుకోకపోగా.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న నారా లోకేశ్​‎ను అడ్డుకుంటారా ? అని మండిపడ్డారు. పరామర్శకు వెళ్లకుండా అర్థం లేని కారణాలను సాకుగా చెప్పి నోటీసులివ్వటం దారుణమన్నారు. రిజర్వేషన్లలో కోత విధించి 16,800 మంది బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవటం సామాజిక న్యాయమా ? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసేది సామాజిక న్యాయం కాదని..,సామాజిక ద్రోహమని పంచుమర్తి దుయ్యబట్టారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.