ntr trust: వరద ముంపు బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్ధిక సాయం ప్రకటించింది. ఇటీవల కురిసిన వర్షాలు, తలెత్తిన వరదల వల్ల మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ.లక్ష ఆర్ధిక సాయం అందించనున్నారు. వరద ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి వారి హోదాతో సంబంధం లేకుండా రూ.5,000 ఇస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి తనవంతు సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పునరావాసం ఏర్పాటు చేయడంతో పాటు బాధితులకు పరిహారం చెల్లించాలన్నారు.
ఇదీ చదవండి: