Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు

author img

By

Published : Oct 11, 2021, 4:23 PM IST

Updated : Oct 11, 2021, 5:13 PM IST

రాష్ట్రంలో కొత్తగా 310 కరోనా కేసులు

16:20 October 11

రాష్ట్రంలో తాజా కరోనా కేసులు

ఏపీ కరోనా బులిటెన్
ఏపీ కరోనా బులిటెన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23,022 పరీక్షలు నిర్వహించగా.. 310  కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,57,562 మంది వైరస్‌ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా ఇద్దరు మరణించారు. వైరస్ బారి నుంచి 994 మంది కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,36,048కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,258 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,67,963 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కరోనా వైరస్ బారినపడి ఇవాళ చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 54, నెల్లూరు జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇదీచదవండి

CM Jagan: 2022 నుంచి హాజరుతో అమ్మఒడి పథకం అనుసంధానం: సీఎం జగన్

Last Updated :Oct 11, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.