'నిన్నటి ఆత్మహత్య.. ఈరోజు రేప్'​గా ఎలా మారింది?: నారా లోకేశ్‌

author img

By

Published : May 9, 2022, 2:10 PM IST

Nara Lokesh

Nara Lokesh: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని కేసులో "నిన్నటి ఆత్మహత్య నేటి రేప్"​గా ఎలా మారిందో జగన్ రెడ్డి చెప్పాలని నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Nara Lokesh: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం వైకాపా దండుపాలెం గ్యాంగ్‌ను తప్పించే ఎత్తుగడేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. తమ కుమార్తెను హత్యాచారం చేశారని తల్లిదండ్రులు ఆరోపించినా... పోస్ట్‌మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ తేల్చేశారని ఆయన మండిపడ్డారు. నిన్నటి ఆత్మహత్య నేటి రేప్​గా ఎలా మారిందో జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

  • పోస్ట్ మార్టం కాకుండానే ఆత్మహత్యగా డిఎస్పీ తేల్చేసింది మీ కళ్లల్లో ఆనందం కోసమేనని అర్థమవుతోంది. నిన్నటి సూసైడ్ నేటి రేప్ గా ఎలా మారింది జగన్ రెడ్డి గారు! ఇది యాగీ చేయడం కాదు. మీ బిడ్డలకో, మీ నేతల పిల్లలకో ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా?(2/2)

    — Lokesh Nara (@naralokesh) May 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బీఫార్మసీ విద్యార్థిని కేసు.. నిందితుడు అరెస్ట్​: శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లకు కు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో నిందితుడైన సాదిక్​ను గోరంట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రమాకాంత్, దిశా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ప్రేమ పేరుతో తేజస్వినిని నమ్మించి.. శారీరకంగా అనుభవించి ఆమె మృతికి కారణమైన సాధిక్​ను కొత్తచెరువు మండలం నారపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం, సెల్​ఫోన్​ సీజ్ చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం 376 సెక్షన్​తో పాటు 420, 306 సెక్షన్లు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి... ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దిశా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

అసలేం జరిగింది: తిరుపతిలో బీ.ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న యువతి తేజస్విని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రియుడుగా చెబుతున్న సాదిక్​కు సంబంధించిన వ్యవసాయ షెడ్డులో ఉరి వేసుకొని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త వెలుగుచూసింది. యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: DIED: మద్యం మత్తులో ఎంత పని చేశాడంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.