Minorities fire on YSRCP about Dulhan Scheme: ముస్లిం యువతులకు మేలు చేసే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. నిరుపేద మైనారిటీ యువతులకు వివాహ సందర్భంగా ఆర్థిక సాయం అందించే "దుల్హన్" పథకాన్ని ఆర్థిక ఇబ్బందులతో అమలు చేయలేమని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారూఖ్ షిబ్లి ఉన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దుల్హన్ పథకంతో పాటు విదేశీ విద్యపైనా ప్రభుత్వం మడమ తిప్పిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోగా.. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారంటున్న పిటిషనర్ షారుఖ్ షిబ్లితో మా ప్రతినిధి ముఖాముఖి.