Health Commissioner: ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదు: వైద్యారోగ్యశాఖ కమిషనర్

author img

By

Published : Sep 24, 2021, 6:47 PM IST

ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదు

ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదని వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్‌ స్పష్టం చేశారు. కొవిడ్ వల్ల ఔషధాలు కొనుగోళ్లు ఐదారు రెట్లు పెరిగిందని.., అవసరాలకు అనుగుణంగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు.

వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆ శాఖ కమిషనర్ భాస్కర్‌ స్పష్టం చేశారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ-ఔషధి వెబ్‌సైట్‌లో ఎక్కడా సమస్యలు లేవన్న కమిషనర్...ఆస్పత్రుల్లో ఔషధాల కొరత లేదన్నారు. కొవిడ్ వల్ల ఔషధాలు కొనుగోలు ఐదారు రెట్లు పెరిగిందన్నారు. అవసరాలకు అనుగుణంగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

క్యాన్సర్ చికిత్స ఔషధాలు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయని కమిషనర్ భాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని..,మొత్తం డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే గుర్తించామన్నారు. డెంగ్యూ జ్వరాలకు సరిపడినన్ని ఔషధాలు, టెస్ట్ కిట్లు ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి

CM Jagan: వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. రాత్రి కర్ఫ్యూపై కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.