విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం వేగవంతానికి ప్రభుత్వం చర్యలు

author img

By

Published : Oct 3, 2022, 4:29 PM IST

PROJECT MANAGEMENT UNIT

PROJECT MANAGEMENT UNIT : విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్​ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేలా ప్రాజెక్టు మేనేజ్మెంట్​ యూనిట్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం 12 మంది అధికారులు, పలువురు సిబ్బందిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.

PMU FOR NEW INDUSTRIAL CORRIDOR: రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేలా ప్రాజెక్టు మేనేజ్​మెంట్​ యూనిట్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం ఈ యూనిట్​ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు మేనేజ్​మెంట్ యూనిట్ కోసం 12 మంది అధికారులు, పలువురు సిబ్బందిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్​మెంట్​ ఆఫీసర్ హోదాలో డిప్యుటేషన్​పై కూడా నియామకం చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.