టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా.. ఆ హీరోలను టార్గెట్‌ చేశారనుకోను: ఆర్జీవీ

author img

By

Published : Jan 10, 2022, 4:00 PM IST

Updated : Jan 10, 2022, 5:24 PM IST

మంత్రి పేర్నితో రామ్‌గోపాల్‌ వర్మ భేటీ

15:56 January 10

మంత్రి పేర్నితో రామ్‌గోపాల్‌ వర్మ భేటీ

మంత్రి పేర్నితో రామ్‌గోపాల్‌ వర్మ భేటీ

సినిమా టికెట్‌ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి పేర్ని నానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సినీ నిర్మాతగా తన అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చానన్నారు. టికెట్‌ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించానన్న ఆయన...టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించినట్లు తెలిపారు. థియేటర్ల మూసివేతపై భేటీలో ఎలాంటి చర్చా జరగలేదని చెప్పారు. తాను చిత్ర పరిశ్రమ తరఫున చర్చలకు రాలేదని..,కేవలం తన వాదన వినిపించేందుకే వచ్చానని ఆర్జీవీ స్పష్టం చేశారు.

"సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం నాకుంది. టికెట్‌ ధర తగ్గిస్తే.. ఆ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుంది. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై చర్యలు తీసుకోవచ్చు. పవన్‌, బాలకృష్ణను ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని అనుకోను. ఒకరిద్దరి కోసం మొత్తం పరిశ్రమను ఇబ్బంది పెడతారనుకోను. ఆర్ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్ వాయిదాకు టికెట్‌ ధరలే కారణం కావొచ్చు. "- ఆర్జీవీ

ఏపీలోని టికెట్ ధరలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి నానితో చెప్పానని ఆర్జీవీ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో పరిస్థితి ఎలా ఉందో వివరించానన్నారు. టికెట్‌ ధరలు పెరిగితే జనం ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారని తెలిపారు. సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండింటిపైనా ఉందన్నారు. మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావించారని వెల్లడించారు.

"టికెట్‌ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పా. టికెట్‌ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించా. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదు. నా వాదన వినిపించేందుకే వచ్చా. మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావించారు. ఏపీలోని టికెట్ ధరలు దేశంలో ఎక్కడా లేవని చెప్పా. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో పరిస్థితి ఎలా ఉందో వివరించా. టికెట్‌ ధరలు పెరిగితే జనం ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారు. అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం దోహదపడుతుంది.సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండింటిపైనా ఉంది." -ఆర్జీవీ దర్శకుడు

ట్వీట్ వార్...
సినిమా టికెట్ల అంశంపై ఏపీ మంత్రులు వర్సెస్ ఆర్జీవీ అన్నట్లుగా గత కొంత కాలంగా ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఆర్జీవీ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్​ చేశారు. ప్రభుత్వంతో గొడవకు దిగాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ఆర్జీవీ చేసిన విజ్ఞప్తికి.. మంత్రి పేర్ని నాని కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. "ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం" అంటూ.. రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని ఇవాళ (జనవరి 10)న అపాయింట్​మెంట్ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నలు..
RGV Comments: అంతకు ముందు సినిమా టికెట్ రేట్లు తగ్గించడాన్ని తప్పుబట్టిన వర్మ.. వరుస ట్వీట్లు చేశారు. మంత్రి పేర్ని నానికి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ని.. కొనేవాడుంటే ఐదు కోట్లకూ అమ్ముతారని అన్నారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్‌కి, ఆలోచనకు ఎలా వెలకడతారని ప్రశ్నించారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంకా బాగుండాలంటే ఏం చేయాలన్నది కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడని తేల్చి చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ ప్రభుత్వానికి తెలియకుండా చేసే నేరమన్న ఆర్జీవీ.. ప్రభుత్వానికి చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించుకోవాల్సి విపరీత పరిస్థితి ప్రస్తుతం లేదని బదులిచ్చారు. పరస్పర అంగీకార లావాదేవీలకు లూటీ అనే పదం సరికాదని హితవు పలికారు. మొదటి నుంచి థియేటర్లు వ్యాపార సంస్థలు మాత్రమేనన్న ఆర్జీవీ.. ప్రజాసేవ కోసం ఎవరూ థియేటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. కావాలంటే మీ గవర్నమెంట్​లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అన్నారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి ఆ డెఫినిషన్(లూటీ) మీకు మీరు ఇచ్చుకుంటున్నారని ట్వీట్ చేశారు.

'వి ఎపిక్‌' థియేటర్‌కు ఏరియాను బట్టి టికెట్ రేటు ఎలా పెట్టారని ప్రశ్నించారు. టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని నిలదీశారు. పవన్ సినిమాకు సంపూర్ణేష్ సినిమాకి వ్యత్యాసం తెలియదా అని ప్రశ్నించిన రాంగోపాల్ వర్మ.. మంత్రిగా మీకు.. మీ డ్రైవర్‌కు కూడా తేడా లేదా? అని సూటిగా ప‌్రశ్నించారు.

అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం
"వంద రూపాయల టికెట్.. వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదు. అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది. కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకు అవసరం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్​కి తెలియకుండా చేసే క్రైమ్. ఓపెన్​గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది." అన్నారు.

మీ పార్టీ కార్యకర్త.. మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు..
"థియేటర్లనేవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు. సొసైటీ ఆధునీకతకు ముఖ్య కారణం మోటివేషన్. ఎందుకంటే.. ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు. మీ పార్టీ కార్యకర్త.. మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. మీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటాడు." అని ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు.

పేదల్ని ధనికుల్ని చేయాలే కానీ.. ధనికుల్ని పేదలుగా చేయకూడదు..
"పేదల కోసం చేయడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు. అయితే.. పేదల్ని ధనికుల్ని చేయడానికి మీ ప్రభుత్వం పని చేయాలి కానీ.. ఉన్న నికుల్ని పేదల్ని చేయకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది. నాని గారు.. నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్​ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్​తో నేను టీవీ డిబేట్​కి రెడీ. మా సినిమా ఇండస్ట్రీకి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ వివాదాన్ని తొలగిపోవడానికి ఇది చాలా అవసరమని నా అభిప్రాయం" అని ట్వీట్లు చేశారు ఆర్జీవీ.

ఇదీ చదవండి

Ramgopal Varma: నేను మంత్రితో మాట్లాడటానికి వచ్చింది.. అందుకే: ఆర్జీవీ

Last Updated :Jan 10, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.