ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్

author img

By

Published : May 12, 2022, 4:05 PM IST

ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలి

ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి బోర్డు.. ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్ల ఎగుమతులు సాధించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో పలు నిర్ణయాలకు ఎస్​ఐపీబీ ఆమోదం తెలిపింది. సర్వేపల్లిలో క్రిబ్కో ఆధ్వర్యంలో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఎగుమతులను ఐదేళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు త్వరగా వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.