ఎస్సీ యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Aug 22, 2022, 4:22 PM IST

డీజీపీకి చంద్రబాబు లేఖ

బలహీనవర్గాలు, ఎస్సీలపై రాష్ట్రంలో దాడులు నిత్యకృత్యమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో కరుణాకర్ అనే ఎస్సీ యువకుడి మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశారు.

నెల్లూరు జిల్లా కావలిలో కరుణాకర్ అనే ఎస్సీ యువకుడి మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. బలహీనవర్గాలు, ఎస్సీలపై రాష్ట్రంలో దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరులో చేపల చెరువులు సబ్ లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్న కరుణాకర్‌ను వైకాపా నేతలు జగదీశ్వరరెడ్డి, సురేశ్​రెడ్డి చేపలు పట్టుకోనీయకుండా వేధించారని పేర్కొన్నారు. అందుకే కరుణాకర్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ఎస్సీలపై దాడి చేసిన వారి పట్ల పోలీసుల ఉదాసీనత కారణంగానే నిందితులు బరితెగిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ
డీజీపీకి చంద్రబాబు లేఖ

ఏం జరిగిందంటే..: వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కావలి పట్టణం ముసునూరు ఎస్సీకాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్‌(36) చేపల చెరువును సబ్‌ లీజుకు తీసుకొని మత్స్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.

ఈసారి వర్షాలు కురిసేలోపే చేపలు పట్టి విక్రయించాలని భావించగా, ముసునూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు, వైకాపా సేవాదళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడంతో పాటు గత నెలలో చెరువులో మందు కలపడంతో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన కరుణాకర్‌ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి సమస్య వివరించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అప్పులెలా చెల్లించాలన్న ఒత్తిడి తట్టుకోలేక కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి కారణమైన వారి వేధింపులతో పాటు, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి సూసైడ్‌ నోట్‌ రాశాడు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.