దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపురసుందరీదేవి రూపం

author img

By

Published : Sep 27, 2022, 9:42 AM IST

Balatripurasundari Devi

Dussehra At Vijayawada : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు కొలువుదీరారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

Balatripurasundari Devi : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు నేడు బాలత్రిపురసుందరిదేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి దర్శనానికి ప్రత్యేక సమయాన్ని ఆలయ కమిటీ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 వరకు, సా. 4 నుంచి 6 వరకు దర్శనాన్ని కేటాయించారు. అక్టోబర్ 2న మినహా ఇతర రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.